బండిపై భగ్గుమన్న బీఆర్ఎస్ శ్రేణులు

బండిపై భగ్గుమన్న బీఆర్ఎస్ శ్రేణులు
  • జిల్లా వ్యాప్తంగా సంజయ్ దిష్టిబొమ్మలు దగ్ధం
  • పోలీస్ స్టేషన్ల లో ఫిర్యాదులు

ముద్ర ప్రతినిధి కరీంనగర్: ఎమ్మెల్సీ, తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత పై అనుచిత వాఖ్యలు చేశారంటూ కరీంనగర్ ఎంపీ, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ పై జిల్లా వ్యాప్తంగా బీఆర్ఎస్ పార్టీ శ్రేణులు బగ్గుమన్నారు.

 బాధ్యత కలిగిన ఎంపీ  మహిళ పట్ల కనీస గౌరవం లేకుండా సభ్యసమాజం తలదించుకునేలా మాట్లాడా రంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. అసభ్య పదజాలంతో మాట్లాడడం సంస్కారహీనం అన్నారు. జిల్లా వ్యాప్తంగా అన్ని మండల కేంద్రాల్లో బండి సంజయ్ దిష్టిబొమ్మ దగ్ధం చేశారు. అనంతరం బండి సంజయ్ పై చర్యలు తీసుకోవాలంటూ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. ఇందులో భాగంగా ప్రజాప్రతినిధులు, బీఆర్ఎస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు భారీ సంఖ్యలో తరలివచ్చి బండి సంజయ్ డౌన్ డౌన్ అంటూ నినాదాలు చేశారు.