పర్యాటకులకు పోలీస్ వారి హెచ్చరిక 

పర్యాటకులకు పోలీస్ వారి హెచ్చరిక 

ముద్ర, వెంకటాపురం(నూ):సుదీర్ఘ ప్రాంతాల నుండి ములుగు జిల్లా,వాజేడు మండలంలో ఉన్నటువంటి జలపాతములు మరియు అడవి అందాలను చూసి ఆనందించుటకు విచ్చేయుచున్న మూడు  రాష్ట్రాల ప్రజలకు హెచ్చరిక.. పోలీసు వారికి మరియు అటవీ శాఖ సిబ్బందికి స్థానిక గ్రామ ప్రజలకు సహకరించగలరు..  నాట్ అలౌడ్..  డేంజర్ బోర్డులను దాటి లోతట్టు నీటి ప్రాంతానికి వెళ్లకండి..ప్రమాదలకు గురికాకండి. ఒక్కసారి మునిగితే 24 గంటల తరువాత శవమై తెలుతున్నారు. నీటిలో మునిగి ప్రమాదం జరిగి ప్రాణాలతో బయటపడినట్టు చరిత్ర లో లేదు.. ప్రాణం చాలా విలువైనది.ముఖ్యంగా మద్యం సేవించి వాహనములు నడుపుతూ రాకండి. మీ పైన చెట్టరీత్యా చర్యలు తీసుకోబడును.. అన్ని రేఖ అశోక్ . సబ్ ఇన్స్పెక్టర్ అఫ్ పోలీస్. వాజేడు.ములుగు జిల్లా గారు హెచ్చరించారు.