విశాఖలో వైసీపీకి షాక్.. టీడీపీలో చేరిన కీలక నేతలు

విశాఖలో వైసీపీకి షాక్.. టీడీపీలో చేరిన కీలక నేతలు

ముద్ర,ఆంధ్రప్రదేశ్:- తెలుగుదేశం పార్టీలో చేరికలు కొనసాగుతున్నాయి. విశాఖ జిల్లాలో వైసీపీకి షాక్ తగిలింది. విశాఖ తూర్పు నియోజకవర్గానికి చెందిన వైసీపీ మాజీ ఇన్‌ఛార్జి అక్కరమాని విజయనిర్మల ఆ పార్టీని వీడారు. ఈరోజు ఉండవల్లి తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు చంద్రబాబు నాయుడు సమక్షంలో తెలుగుదేశం పార్టీలో చేరారు.