44,163 మంది వాలంటీర్లు రాజీనామా...
ముద్ర,ఆంధ్రప్రదేశ్:- రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటివరకు 44,163 మంది వాలంటీర్లు రాజీనామా చేశారని ఏపీ ఎన్నికల ప్రధానాధికారి ముకేశ్ కుమార్ మీనా మీడియాతో వెల్లడించారు. రూ. 180 కోట్ల నగదుతో పాటు రూ. 41 కోట్ల విలువైన ఆభరణాలు, పరికరాలు, వస్తువులను స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. అలాగే రూ.22 కోట్ల విలువైన మద్యం, రూ.31 కోట్ల విలువైన డ్రగ్స్ సీజ్ చెసినట్లు పేర్కొన్నారు.