ఈ నెల 19న విచారణకు హాజరు కావాలి: అవినాశ్ రెడ్డికి సీబీఐ ఆదేశం
![ఈ నెల 19న విచారణకు హాజరు కావాలి: అవినాశ్ రెడ్డికి సీబీఐ ఆదేశం](https://mudranews.in/uploads/images/2023/03/image_750x_640b0e6c5175c.jpg)
ఎంపీ అవినాశ్ రెడ్డికి సీబీఐ మరోసారి నోటీసులు ఇచ్చింది. ఈ నెల 19న విచారణకు హాజరు కావాలని ఆదేశించింది. ఈ రోజు విచారణకు రాలేనని అవినాశ్ రెడ్డి సీబీఐకి సమాచారం ఇచ్చారు. దీంతో 19న విచారణకు రావాలని చెప్పింది. వివేకా హత్య కేసులో అవినాశ్ రెడ్డి ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. సీబీఐ ముందు హాజరైన అవినాశ్ రెడ్డి అనుచరులు. వైఎస్ వివేకా హత్య కేసులో సీబీఐ విచారణకు హాజరైన నాగేళ్ళ విశ్వేశ్వరరెడ్డి, వర్రా రవీంద్రా రెడ్డి, శ్రీకాంత్ రెడ్డి. వైఎస్ వివేకానందరెడ్డి హత్య జరిగిన రోజు ఉదయ్ కుమార్ రెడ్డితో వీరు ఉన్నట్లు సీబీఐ గుర్తించింది. వీరితో ఉదయ్కుమార్ రెడ్డి ఫోన్ సంభాషణలు జరిపారని చెబుతున్న సీబీఐ.
వెంటనే విచారణకు రావాలి : అవినాశ్ రెడ్డికి సీబీఐ ఆదేశం
వైసీపీ ఎంపీ అవినాశ్ రెడ్డిని వెంటనే విచారణకు హాజరుకావాలని సీబీఐ ఆదేశించింది. సీబీఐని నాలుగు రోజులు అవినాశ్ రెడ్డి గడువు కోరారు. ఈ మేరకు ఆయన రాసిన లేఖపై సీబీఐ స్పందించింది. ఆయన విజ్ఙప్తిని తిరస్కరించింది. వెంటనే విచారణకు మాజరుకావాలని ఆదేశించింది.