ఈ నెల 19న విచారణకు హాజరు కావాలి: అవినాశ్​ రెడ్డికి సీబీఐ ఆదేశం 

ఈ నెల 19న విచారణకు హాజరు కావాలి: అవినాశ్​ రెడ్డికి సీబీఐ ఆదేశం 

ఎంపీ అవినాశ్​ రెడ్డికి సీబీఐ మరోసారి నోటీసులు ఇచ్చింది. ఈ నెల 19న విచారణకు హాజరు కావాలని ఆదేశించింది. ఈ రోజు విచారణకు రాలేనని అవినాశ్​ రెడ్డి సీబీఐకి సమాచారం ఇచ్చారు. దీంతో 19న విచారణకు రావాలని చెప్పింది. వివేకా హత్య కేసులో అవినాశ్​ రెడ్డి ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. సీబీఐ ముందు హాజరైన అవినాశ్​ రెడ్డి అనుచరులు. వైఎస్​ వివేకా హత్య కేసులో సీబీఐ విచారణకు హాజరైన నాగేళ్ళ విశ్వేశ్వరరెడ్డి, వర్రా రవీంద్రా రెడ్డి, శ్రీకాంత్​ రెడ్డి. వైఎస్​ వివేకానందరెడ్డి హత్య జరిగిన రోజు ఉదయ్​ కుమార్​ రెడ్డితో వీరు ఉన్నట్లు సీబీఐ గుర్తించింది. వీరితో ఉదయ్​కుమార్​ రెడ్డి ఫోన్​ సంభాషణలు జరిపారని చెబుతున్న సీబీఐ. 

వెంటనే విచారణకు రావాలి : అవినాశ్​ రెడ్డికి సీబీఐ ఆదేశం 

వైసీపీ ఎంపీ అవినాశ్​ రెడ్డిని వెంటనే విచారణకు హాజరుకావాలని సీబీఐ ఆదేశించింది. సీబీఐని నాలుగు రోజులు అవినాశ్​ రెడ్డి గడువు కోరారు. ఈ మేరకు ఆయన రాసిన లేఖపై సీబీఐ స్పందించింది. ఆయన విజ్ఙప్తిని తిరస్కరించింది. వెంటనే విచారణకు మాజరుకావాలని ఆదేశించింది.