గజ్వేల్ సంఘటనల్లో మరో ఆరుగురి అరెస్ట్
- ఇప్పటివరకు 8 కేసులు నమోదు
- ఆయా కేసుల్లో 17మంది నిందితుల అరెస్టు
- మరి కొంతమంది అరెస్టుకు చర్యలు : సిపి శ్వేత
ముద్ర ప్రతినిధి, సిద్దిపేట:
గజ్వేల్ పట్టణంలో జరిగిన సంఘటనల విషయంలో బుధవారం రాత్రి మరో 6 మందిని నిందితులను పోలీసులు అరెస్టు చేశారు. ఈనెల3,4 తేదీలలో (రెండు రోజులలో) గజ్వేల్ పట్టణంలో జరిగిన సంఘటన విషయంలో పాల్గొన్న వారందరిపై ఇప్పటి వరకు పోలీసులు 8 కేసులు నమోదు చేశారు. సంఘటనల్లో పాల్గొన్న నిందితులను పట్టుకోవడానికి ప్రత్యేక టీమ్స్ ఏర్పాటు చేశారు. ఇన్వెస్టిగేషన్లో భాగంగా 11 మంది నిందితులను దశల వారీగా అరెస్టు చేసి జ్యుడిషియల్ రిమాండ్కు పంపించిన విషయం ప్రజలకు విధితమే, సిద్దిపేట జిల్లా పోలీస్ కమిషనర్ నేరేళ్లపల్లి శ్వేతా రెడ్డి గజ్వేల్ లో మఖం వేసి అన్ని కోణాల్లో ఈ సంఘటనలపై దర్యాప్తులు చేయిస్తూ నిందితులను అరెస్టులు చేస్తున్నారు.
బుధవారం రాత్రి అరెస్టు చేసిన వారిలో దేవుళ్ళపల్లి మనోహర్ యాదవ్, కైలాస శ్రీకాంత్, అంతన్నగారి గణేష్,
గంగిశెట్టి రవీందర్, సుంకరి బాలాకుమార్, పిట్ల కుమార్ @ డీజే కుమార్ ఉన్నారు. గజ్వేల్ సంఘటనల విషయంలో కేసుల పరిశోధన గురించి ప్రత్యేక టీమ్స్ ను ఏర్పాటు చేశామని, త్వరలో మరి కొంతమందిని నిందితులను అరెస్టు చేస్తామని పోలీస్ కమిషనర్ ఎన్. శ్వేత తెలిపారు.