బంగారం కోసం కన్నవారినే చంపిన కసాయి కొడుకు..

బంగారం కోసం కన్నవారినే చంపిన కసాయి కొడుకు..

ముద్ర,తెలంగాణ:- చెడు అలవాట్లకు బానిసైన కొడుకు తల్లి ఒంటి పై బంగారం కోసం తల్లిదండ్రులను హతమార్చాడు ఓ కసాయి కొడుకు. ఈ దారుణ ఘటన గత నెలలో జరిగింది. ఘటన జరిగిన 25 రోజుల తర్వాత ఈ కేసులో అసలు విషయం బయటకు వచ్చింది. అత్తమామల హత్యకు కోడలు కూడా సహకరించింది. 

గత నెల 22న నర్సాపూర్ రాయరావు చెరువు వద్ద వృద్ద దంపతుల మృతదేహాలు లభ్యమయ్యాయి. వారిని సంగారెడ్డి జిల్లా హత్నూర మండలం సాదుళ్లనగర్‌కి చెందిన కిష్టయ్య, నర్సమ్మగా గుర్తించారు. కిష్టయ్య, నర్సమ్మల కొడుకు లక్ష్మణ్ దుండిగల్‌లో ప్రైవేట్‌ ఉద్యోగం చేస్తున్నాడు. చెడు అలవాట్లకు బానిసై లక్ష్మణ్ అప్పులపాలయ్యాడు.అప్పులు తీర్చడానికి తల్లి మెడలో ఉన్న మూడున్నర తులాల బంగారు గొలుసు పై కన్నేశాడు. గత నెలలో తల్లిదండ్రులను ఆ కుమారుడు ఇంటికి పిలిచాడు. ఇంట్లో తల్లిదండ్రులు నిద్రిస్తుండగా తల్లి గొంతునులిమి చంపేశాడు. కాసేపటికే తండ్రి నిద్రలేచి చూడటంతో తండ్రిని కూడా చంపేశాడు. భార్య సహాయంతో కారులో నర్సాపూర్ అడవుల్లో మృతదేహాలను తీసుకువచ్చి పెట్రోల్ పోసి తగలబెట్టి భార్యభర్తలిద్దరూ పరారయ్యారు. స్థానికుల సమాచారంతో పోలీసులు ఘటనాస్థలికి చేరుకొని విచారించగా అసలు విషయం వెలుగులోకి వచ్చింది.