ఆలేరు ఎమ్మెల్యే సహకారంతో యాస రామ్ రెడ్డి కి సీఎంఆర్ఎఫ్ చెక్కు అందజేత

ఆలేరు ఎమ్మెల్యే సహకారంతో యాస రామ్ రెడ్డి కి సీఎంఆర్ఎఫ్ చెక్కు అందజేత

మోటకొండూర్ ముద్ర న్యూస్ : మోట కొండూర్ మండలం కదిరేణిగూడెం గ్రామానికి చెందిన యాస రామ్ రెడ్డి ఇటీవల అనారోగ్యానికి గురికాగా వైద్య ఖర్చుల నిమిత్తం ముఖ్యమంత్రి సహాయ నిధి నుండి మంజూరి అయిన 60 వేల రూపాయల చెక్కును ఆదివారం అందజేశారు. ప్రభుత్వ విప్ ఆలేరు శాసనసభ్యురాలు శ్రీమతి గొంగిడి సునీత మహేందర్ రెడ్డి సహకారంతో ముఖ్యమంత్రి సహాయ నిధి నుండి మంజూరి అయిన సీఎంఆర్ఎఫ్ చెక్కుని మూటకొండూర్ మండల ఎంపీపీ పైళ్ల ఇందిర సత్యనారాయణ రెడ్డి, కదిరేణిగూడెం సర్పంచ్ వేముల పాండు, బిఆర్ఎస్  గ్రామ శాఖ అధ్యక్షులు సిగసతీష్ లబ్ధిదారునికి  అందజేశారు.

ఈ కార్యక్రమంలో బిఆర్ఎస్ నాయకులు తొండల ఆగయ్య, కోమటి రెడ్డి అంజిరెడ్డి, పన్నాల మోహన్ రెడ్డి, రాంపల్లి అంజయ్య, వార్డు సభ్యులు పన్నాల పుష్పమ్మ  తదితరులు పాల్గొన్నారు.