బిఆర్ఎస్ పార్టీ నుండి పలువురి సస్పెండ్

బిఆర్ఎస్ పార్టీ నుండి పలువురి సస్పెండ్

బాన్సువాడ, ముద్ర:బాన్సువాడ నియోజకవర్గ శాసనసభ ఎన్నికల్లో పార్టీకి వ్యతిరేకంగా పనిచేసిన బోర్లమ్ గ్రామ ఎంపీటీసీ శ్రావణి, రైతుబంధు మండల డైరెక్టర్ దేవేందర్ రెడ్డి, పార్టీమహిళా మండల అధ్యక్షురాలు భునేకర్ జ్యోతి, నాయకుడు ప్రకాష్ ను పార్టీ నుంచి సస్పెండ్  చేశారు.  ఈ మేరకు బుధవారం పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మండల అధ్యక్షుడు మోహన్ నాయక్ తెలిపారు. ఈ కార్యక్రమంలో నాయకులు అంజిరెడ్డి, మున్సిపల్ చైర్మన్ గంగాధర్, దొడ్ల వెంకట్రామిరెడ్డి, గోపాల్ రెడ్డితో పాటు నాయకులు పాల్గొన్నారు.