అమెరికా అధ్యక్షుడు బైడెన్ హత్యకు తెలుగు యువకుడి కుట్ర
అమెరికా అధ్యక్షుడు బైడెన్ హత్యకు తెలుగు యువకుడు కుట్ర పన్నాడు. వైట్హౌస్ పరిసరాల్లోకి ట్రక్తో దూసుకెళ్ళిన కందుల సాయివర్షిత్ అనే యువకుడు. వైట్ హౌస్ ముందు బారికేడ్లను సాయి వర్షిత్ ట్రక్తో ఢీకొట్టాడు. అతని ట్రక్పై నాజీ జెండా ఉంది. పోలీసులు అతన్ని అదుపులోకి తీసుకున్నారు. అధ్యక్షుడి హత్యకు కుట్ర, రాష్ డ్రైవింగ్, ఆస్తులు ధ్వంసం కేసులు నమోదు చేశారు. విచారణలో యువకుడు నేరం అంగీకరించాడు. 6 నెలలుగా బైడెన్ హత్యకు కుట్ర పన్నినట్లు తెలిపాడు