ఉక్రెయిన్‌ యుద్ధంలో నాశనమైన నగరంలో  పుతిన్‌ పర్యటన

ఉక్రెయిన్‌ యుద్ధంలో నాశనమైన నగరంలో  పుతిన్‌ పర్యటన

సైనిక చర్య పేరుతో ఉక్రెయిన్‌పై దురాక్రమణ  మొదలుపెట్టిన రష్యా.. అనేక నగరాల్లో విధ్వంసం సృష్టించిన విషయం తెలిసిందే.  ఇందులో భాగంగా తీర ప్రాంతమైన మేరియుపోల్‌నూ పూర్తిగా నాశనం చేసింది. మరుభూమిగా మారిన ఆ నగరంలో రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్‌ పుతిన్‌ ఆకస్మిక పర్యటన చేశారు. ఉక్రెయిన్‌ సంక్షోభం ముగిసిన తర్వాత ఆక్రమిత భూభాగాల్లో పుతిన్‌ పర్యటించడం ఇదే తొలిసారి.

ఉక్రెయిన్‌ భూభాగాలపై రష్యా క్షిపణి దాడులు చేస్తోన్న సమయంలోనే పుతిన్‌ మేరియుపోల్‌కు వెళ్లడం ప్రాధాన్యం సంతరించుకుంది.  మేరియుపోల్‌కు హెలికాప్టర్‌లో వెళ్లిన పుతిన్‌.. నగరంలోని చాలా ప్రాంతాల్లో పర్యటించినట్లు క్రెమ్లిన్‌ వెల్లడించింది. అంతేకాకుండా అక్కడక్కడ ఆగుతూ స్థానికులతో మాట్లాడినట్లు తెలిపింది. ఉక్రెయిన్‌పై భీకర దాడులు మొదలుపెట్టిన తర్వాత తొలిసారి యుద్ధ ప్రభావిత ప్రాంతాల్లో పుతిన్‌ పర్యటించారు.