పీవీకి ఘన నివాళి

పీవీకి ఘన నివాళి

ముద్ర ప్రతినిధి, జనగామ : బహు భాషాకోవిధుడు, మాజీ ప్రధాని పీవీ నర్సింహారావు జయంతిని కాంగ్రెస్‌ శ్రేణులు ఘనంగా నిర్వహించాయి. ఈ సందర్భంగా బుధవారం జనగామలోని కొమ్మూరి క్యాంపు కార్యాలయంలో పీవీ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో పీసీసీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కోటురి మానవత రాయ్, మాజీ ఎమ్మెల్యే కొమ్మూరి ప్రతాప్ రెడ్డి పాల్గొని మాట్లాడారు. దేశం కష్టకాలంలో ఉన్నప్పుడు ఆర్థిక సంస్కరణలు తీసుకొచ్చి దేశాభివృద్ధికి కృషి చేసిన గొప్ప వ్యక్తి పీవీ అని కొనియాడారు. పీవీ తమవాడు కావడం గర్వకారణమన్నారు. ఆయనను భావితరాలు స్ఫూర్తి తీసుకుని ముందుకు సాగాలన్నారు. కార్యక్రమంలో జిల్లెల్ల సిద్దారెడ్డి, గంగం నర్సింహారెడ్డి, చారబుడి దయకర్ రెడ్డి, పోరెడ్డి మల్లారెడ్డి, బనుక శివరాజ్, అల్లం ప్రదీప్ రెడ్డి, సుంకరి శ్రీనివాస్ రెడ్డి, లింగాల నర్సిరెడ్డి బచ్చనపేట ఎంపీటీసీ నల్లగొని బాల కిషన్ గౌడ్, వెంకిర్యలా ఎంపీటీసీ పరుశురాములు, కౌన్సిలర్ ముస్త్యాల చందర్, ఆలేటి సిద్దిరాములు, బోట్ల నర్సింగరావు, పిట్టల సతీష్, విజయలక్ష్మి, ఆకుల లక్ష్మయ్య, జాయ మల్లేష్, దాసరి శేఖర్, నోముల సోమయ్య, దాసరి క్రాంతి, అర్షద్ తదితరులు పాల్గొన్నారు.