ఎండాకాలంలో ప్రయాణికులకు చల్లటి కబురు చెప్పిన టీఎస్ ఆర్టీసీ ...

ఎండాకాలంలో ప్రయాణికులకు చల్లటి కబురు చెప్పిన టీఎస్ ఆర్టీసీ ...

ముద్ర,తెలంగాణ :- భానుడు భగభగ మండుతుండటంతో గ్రేటర్‌లో ఏసీ బస్సులకు డిమాండ్‌ పెరిగింది. ఈ నేపథ్యంలో ఏప్రిల్‌ నాటికి కొత్తగా మరో 100 ఎలక్ట్రిక్ ఏసీ బస్సులను అందుబాటులోకి తెచ్చేందుకు ఆర్టీసీ చర్యలు తీసుకుంటోంది. ఎండలు ముదిరేనాటికి రోడ్లపైకి తెస్తే ఆదరణ పెరుగుతుందని సంస్థ భావిస్తోంది. గ్రేటర్‌జోన్‌లో ఇప్పటికే 64 ఎలక్ట్రిక్ ఏసీ బస్సులను ఆర్టీసీ నడుపుతున్నది. ఎయిర్‌పోర్ట్‌ రూట్లలో నడిచే ఏసీ బస్సులకు సాధారణరోజుల్లో 60 శాతం ఆక్యుపెన్సీ ఉంటే, వేసవిలో 85 శాతానికి పెరుగుతోందని అధికారులు చెబుతున్నారు.గత వారం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి 100 కొత్త బస్సు లను ప్రారంభించారు.