ట్రాక్టర్ ఢీకొని మహిళ మృతి

ట్రాక్టర్ ఢీకొని మహిళ మృతి

పిట్లం, ముద్ర: కామారెడ్డి జిల్లా పిట్లం మండలం సిద్ధపూర్ తాండ వద్ద బుధవారం రాత్రి ట్రాక్టర్ ఢీకొని మహిళ మృతి చెందింది. మల్లూరుతండా కు చెందిన నునవత్ షానుభాయ్(40) సిద్దాపూర్ తండాలో జొన్నలు పట్టి తెగిరిగి  వెళ్తుండగా మార్గ మధ్యలో సిద్దపూర్ తండా  శివారులోని వీర్సింగ్ బయీ దగ్గర జొన్నల యంత్రం ట్రాక్టర్ డ్రైవర్ అజాగ్రత్త నడపడం వల్ల జొన్న మెషిన్ పైన కూర్చున్న షానుబాయ్, మరో ఇద్దరు కిందపడగా జొన్న మెషిన్ వారిపై పడినది.  దానితో షానుభాయ్ అక్కడిక్కడే మరణించినది. మిగిలిన ఇద్దరికీ గాయాలు కాగా వారిని బాన్స్వాడ ప్రభుత్వ అస్పత్రికి తీసుకెళ్లినారు. ఈ విషయం పైన మృతురాలి భర్త అయినా హరిచంద్ పిర్యాదు మేరకు కేసు నమోదుచేసి ధర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై విజయ్ తెలిపారు.