వైసీపీ ప్రభుత్వం దొంగ ఓట్లు వేసేందుకు సిద్ధమవుతోంది

వైసీపీ ప్రభుత్వం దొంగ ఓట్లు వేసేందుకు సిద్ధమవుతోంది

అమరావతి: వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో భారీగా దొంగ ఓట్లు వేసేందుకు ఇప్పటి నుంచే వైసీపీ  ప్రభుత్వం సిద్ధమవుతోందని టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు  సంచలన వ్యాఖ్యలు చేశారు.  శనివారం మంగళగిరి సీకే కన్వెన్షన్ సెంటర్‌లో టీడీపీ లీగల్ సెల్ రాష్ట్రస్థాయి సదస్సులో పాల్గొన్నారు. ఈ సందర్భంగా అచ్చెన్నాయుడు మాట్లాడుతూ..''కుట్రల్ని ఛేదించేందుకు లీగల్ సెల్ మరింతగా కృషి చేయాలి. లోకేష్ యువగళం పాదయాత్ర లో ప్రతీ 2 రోజులకో కేసు పెడుతుండటం దుర్మార్గం. ఎప్పుడు ఎన్నికలు పెట్టినా మళ్లీ అధికారంలోకి వచ్చేందుకు తెలుగుదేశం సిద్ధంగా ఉండటానికి లీగల్ సెల్ కృషి ఎంతో ఉంది.

లీగల్ సెల్ కృషిలేకపోతే తెలుగుదేశం పరిస్థితి క్లిష్టంగా ఉండేది. 2019 తర్వాత రాష్ట్రంలో మరో రాజకీయ పార్టీనే ఉండకూడదన్నట్లుగా సైకో పాలన సాగుతోంది. తెలుగుదేశం పార్టీ వైసీపీలా గాలికి పుట్టిన పార్టీ కాదని జగన్మోహన్ రెడ్డి  గ్రహించాలి. స్వాతంత్య్రం వచ్చాక న్యాయ విభాగం అవసరం ఇప్పుడొచ్చినంతగా ఎప్పుడూ రాలేదు..చెప్పటానికి బాధ అనిపిస్తున్నా న్యాయవాదులకు ఈ 4 ఏళ్ల''లో మంచిగా పని దొరికిందని అచ్చెన్నాయుడు అన్నారు.