సికింద్రాబాద్ కంటోన్మెంట్ ఎమ్మెల్యే లాస్య నందిత ఒంటిపై 12 తాయత్తులు
ఈ నేపథ్యంలో ఈ రెండు ప్రమాదాల నుంచి ఆమె తృటిలో తప్పించుకున్నారు. ఈ విషయం ఎమ్మెల్యే లాస్య నందితకు కూడా అర్థం అయ్యింది. దీంతో ఆమె ఆలయాలకు వెళ్లి ప్రత్యేక పూజలు చేశారు. దర్గాలు, బాబాల వద్దకు కూడా వెళ్లారు. వారివద్ద తయత్తులు కట్టించుకున్నారు. ఆమె మరణించిన అనంతరం గాంధీ హాస్పిటల్ లో పోస్టుమార్టం నిర్వహిస్తున్న డాక్టర్లు వాటిని గుర్తించారు. ఆమె ఒంటిపై ఉన్న సుమారు 12 తాయత్తులను తొలగించారు. అనంతరం వాటిని పోలీసులకు అప్పగించారు.