సికింద్రాబాద్ కంటోన్మెంట్ ఎమ్మెల్యే లాస్య నందిత ఒంటిపై 12 తాయత్తులు

సికింద్రాబాద్ కంటోన్మెంట్ ఎమ్మెల్యే లాస్య నందిత ఒంటిపై 12 తాయత్తులు
ముద్ర, సెంట్రల్ డెస్క్:-రెండుసార్లు ప్రాణాలతో బయటపడిన లాస్య నందితను మూడోసారి రోడ్డు ప్రమాదం బలి తీసుకుంది. కంటోన్మెంట్లో ప్రైవేట్ ఆస్పత్రి ప్రారంభోత్సవం సందర్భంగా లిఫ్టులో ఇరుక్కోవడం, ఇటీవల మాజీ సీఎం కేసీఆర్ నిర్వహించిన నల్గొండ సభకు వెళ్లి వస్తూ కారు ప్రమాదానికి గురయ్యారు. ఈ ప్రమాదంలో ఓ ట్రాఫిక్ కానిస్టేబుల్ ప్రాణాలు కోల్పోయారు.

ఈ నేపథ్యంలో ఈ రెండు ప్రమాదాల నుంచి ఆమె తృటిలో తప్పించుకున్నారు. ఈ విషయం ఎమ్మెల్యే లాస్య నందితకు కూడా అర్థం అయ్యింది. దీంతో ఆమె ఆలయాలకు వెళ్లి ప్రత్యేక పూజలు చేశారు. దర్గాలు, బాబాల వద్దకు కూడా వెళ్లారు. వారివద్ద తయత్తులు కట్టించుకున్నారు. ఆమె మరణించిన అనంతరం గాంధీ హాస్పిటల్ లో పోస్టుమార్టం నిర్వహిస్తున్న డాక్టర్లు వాటిని గుర్తించారు. ఆమె ఒంటిపై ఉన్న సుమారు 12 తాయత్తులను తొలగించారు. అనంతరం వాటిని పోలీసులకు అప్పగించారు.