15.500 కిలోల గంజాయి దగ్ధం

15.500 కిలోల గంజాయి దగ్ధం

ముద్ర ప్రతినిధి కరీంనగర్ : కమిషనరేట్ వ్యాప్తంగా వివిధ కేసుల్లో స్వాధీనం చేసుకున్న గంజాయిని మంగళవారంనాడు కరీంనగర్ పోలీస్ కమిషనర్, జిల్లా మాదకపదార్థాల నియంత్రణ కమిటి చైర్మెన్ ఎల్. సుబ్బరాయుడు ఆదేశాల మేరకు కమిషనరేట్ కేంద్రంలో దగ్ధం చేశారు.

కమిషనరేట్ లోని వివిధ పోలీస్ స్టేషన్ల పరిధిలో పట్టుకున్న 15కిలోల 500గ్రాముల గంజాయిని దగ్ధం చేశారు. ఈ కార్యక్రమంలో అడిషనల్ డిసిపి పరిపాలన) జి చంద్రమోహన్, సిసిఆర్బి ఇన్సపెక్టర్ రాజేశ్ సంబంధిత పోలీస్ స్టేషన్లకు చెందిన అధికారులు పాల్గొన్నారు.