పిడుగు పాటుకు ఆవు, బర్రె మృతి...
ముద్ర, గంభీరావుపేట: రాజన్న సిరిసిల్ల జిల్లా గంభీరావుపేట మండల కేంద్రంలో పిడుగు పడి ఓ ఆవు, బర్రె మృతి చెందినది. గంభీరావుపేట గ్రామానికి చెందిన రమేష్ రెడ్డి ఆవు, శ్రీనివాస్ రెడ్డి బర్రె వారి వారి వ్యవసాయ పొలాల వద్ద కట్టేశారు. గురు వారం రాత్రి ఉరుములతో కూడిన భారీ వర్షం కురిసింది.
ఒక్కసారిగా ఉరుములు, మెరుపులు అధికమై ఆవు,బర్రె ఉన్న ప్రాంతంలో పిడుగు పడింది. దీంతో శ్రీనివాస్ రెడ్డి, రమేష్ రెడ్డి లు వారి పొలాల వద్దకు వెళ్లి చూసేసరికి ఆవు, బర్రె మృతి చెందినాయి.. తమకు జీవనాధారంగా ఉన్న ఆవు, బర్రె లు చనిపోయాయని, రైతులు ఆవేదన వ్యక్తం చేశారు . అధికారులు ఆదుకోవాలని విజ్ఞప్తి చేశారు.