గిఫ్ట్ ప్యాక్స్ అందించిన వైస్ ఎంపీపీ
![గిఫ్ట్ ప్యాక్స్ అందించిన వైస్ ఎంపీపీ](https://mudranews.in/uploads/images/2023/04/image_750x_644218592416b.jpg)
స్టేషన్ ఘన్ పూర్, ముద్ర: జనగామ జిల్లా స్టేషన్ ఘన్ పూర్ మండలం తాటికొండ గ్రామానికి చెందిన మైనారిటీలకు ప్రభుత్వం అందిస్తున్న “రంజాన్” గిఫ్ట్ ప్యాకులను శుక్రవారం మండల వైస్ ఎంపీపీ చల్ల సుధీర్ రెడ్డి అందించారు. కార్యక్రమంలో సర్పంచ్ చల్ల ఉమాదేవి, ఉప సర్పంచ్ మారపాక రాములు, మైనారిటీ అధ్యక్షులు సయ్యద్ అయాజ్, మండలం మైనార్టీ ఉపాధ్యక్షులు మహమ్మద్ మోసిన్ అలీ, మండలం మైనార్టీ నాయకులు మహమ్మద్ అరాఫత్ మొహమ్మద్ సబ్జెర్, మహమ్మద్ ఖాసిం, మహమ్మద్ అబిద్, మహమ్మద్ షాహిద్ ముస్లిం పెద్దలు, యూత్ నాయకులు పాల్గొన్నారు.