నూతన అదనపు కలెక్టర్గా రోహిత్ సింగ్
ముద్ర ప్రతినిధి, జనగామ: జనగామ జిల్లాకు నూతన అదనపు కలెక్టర్గా బి.రోహిత్ సింగ్ (రెవెన్యూ) ను ప్రభుత్వ ఉత్తర్వులు జారీ చేసింది. ఈ మేరకు శనివారం ఆయన జిల్లా కలెక్టర్ సి.హెచ్ శివలింగయ్యను మర్యాదపూర్వకంగా కలిసి అనంతరం బాధ్యతలు స్వీకరించారు. హైదరాబాద్కు చెందిన రోహిత్ సింగ్ గతంలో నల్గొండ జిల్లాలో పనిచేశారు. ఆయన సతీమణి అపూర్వ గూగుల్లో ఉద్యోగం చేస్తున్నారు. వీరికి ఒక కూతురు ఉంది.