కలెక్టరేట్ లో దివ్యాoగుడి ఆత్మహత్య యత్నం
జోగులాంబ గద్వాల, ముద్ర ప్రతినిధి: గురువారం దివ్యాoగుల కోటా కింద 15వ వార్డుకు చెందిన శాలిమియాకు డబల్ బెడ్ రూమ్ అలాట్ అయింది. ఇతని పేరు తొలగించి వేరొక పేరు చేర్చడంతో కలెక్టరేట్ కార్యాలయం ముందు పెట్రోల్ పోసుకొని ఆత్మహత్య చేసుకునే ప్రయత్నించాడు. ఇది గమనించిన పోలీసులు, ఎంఐఎం పార్టీ నాయకుడు బంగి సుదర్శన్, పెట్రోల్ బాటిల్ లాక్కొని అతనిపై నీళ్లు పోశారు. నాకు న్యాయం జరగకపోతే నేను నా కుటుంబం ఆత్మహత్య చేసుకుంటామని అంటున్న శాల్మియా.