బీఆర్ఎస్  పార్టీ కి భారీ షాక్

బీఆర్ఎస్  పార్టీ కి భారీ షాక్

ముద్ర ప్రతినిధి, బీబీనగర్: భువనగిరి నియోజకవర్గం బీబీనగర్ మండలం నుంచి పలువురు బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు ఆ పార్టీకి రాజీనామా చేసి ఆదివారం భారతీయ జనతా పార్టీలో చేరారు. బీబీనగర్ మండలం గూడూరు గ్రామానికి చెందిన బీఆర్ఎస్ ఎంపీటీసీ తోర్పునూరి స్వప్న రాజశేఖర్ గౌడ్ బీఆర్ఎస్ పార్టీని వీడి భువనగిరి బీజేపీ ఎంపీ అభ్యర్థి బూర నర్సయ్య గౌడ్, బీజేపీ జిల్లా అధ్యక్షుడు పాశం భాస్కర్ ల సమక్షంలో బీజేపీలో చేరారు.

 బూర నర్సయ్య గౌడ్ వారికి కాషాయం కండువా కప్పి సాదరంగా పార్టీలోకి ఆహ్వానించారు. వీరితో పాటు మాజీ సర్పంచ్ గడ్డం గోపాల్ రెడ్డి, కో ఆప్షన్ సభ్యులు కసగోని పరమేశ్వర్ గౌడ్, సత్యం గౌడ్. కొంతం కొండల్ రెడ్డి, తుర్రి రాజు, గడ్డం జంగారెడ్డి. గంగయ్య, ఉమేష్, భాను, రాజు, వంశీ, కుమార్, జగదీష్, తదితరులు బీజేపీలో చేరారు. గూడూరు నుంచి మొత్తం 150 మంది నాయకులు, కార్యకర్తలు భారతీయ జనతా పార్టీలో  చేరారు.