భారీ ర్యాలీగా భువనగిరికి తరలిన బీబీనగర్ కాంగ్రెస్ శ్రేణులు

భారీ ర్యాలీగా భువనగిరికి తరలిన బీబీనగర్ కాంగ్రెస్ శ్రేణులు

బీబీనగర్, ముద్ర ప్రతినిధి: భువనగిరిలో ఆదివారం సాయంత్రం జరిగిన సీఎం రేవంత్ రెడ్డి రోడ్ షోకు బీబీనగర్ నుంచి పెద్దసంఖ్యలో కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు బయల్దేరారు. వివిధ గ్రామాల నుంచి బీబీనగర్ చేరుకున్న తర్వాత ఇక్కడి నుంచి కార్లు, ప్రైవేటు స్కూల్ బస్సులు, ఇతర వాహనాలలో ర్యాలీగా బయల్దేరి భువనగిరి వెళ్లారు. భువనగిరి పార్లమెంట్ లో తప్పనిసరిగా కాంగ్రెస్ జెండా ఎగురవేయాల్సిన అవసరం వుందని నాయకులు అన్నారు. 

భువనగిరి పార్లమెంట్ అభ్యర్థి చామల కిరణ్ కుమార్ రెడ్డికి భారీ మెజారిటీతో విజయం సిద్ధిస్తుందని అన్నారు. ర్యాలీలో కాంగ్రెస్ నాయకులు పంజాల రామాంజనేయ గౌడ్, పొట్టోళ్ల శ్యామ్ గౌడ్, గోలి పింగళ్ రెడ్డి, నరేందర్ రెడ్డి, భార్గవ్, సత్తిరెడ్డి, పంజాల పెంటయ్య, దండెం ప్రభాకర్, ఆగమయ్య గౌడ్ తదితరులు పాల్గొన్నారు.