స్త్రీ అంటేనే శక్తి స్వరూపిణి : యాదాద్రి జిల్లా జడ్జి కే మారుతీ దేవి

స్త్రీ అంటేనే శక్తి స్వరూపిణి : యాదాద్రి జిల్లా జడ్జి కే మారుతీ దేవి

ముద్ర ప్రతినిధి భువనగిరి :స్త్రీ అంటేనే శక్తి స్వరూపిణి అని యాదాద్రి జిల్లా జడ్జి కే మారుతీ దేవి అన్నారు. దసరా పండుగ పురస్కరించుకొని బుధవారం భువనగిరి కోర్టు బార్ అసోసియేషన్ లో బార్ అసోసియేషన్ అధ్యక్షులు నాగారం అంజయ్య ఆధ్వర్యంలో అలయ్ బలయ్ కార్యక్రమాన్ని నిర్వహించారు.ఈ కార్యక్రమానికి భువనగిరి జిల్లా ప్రధాన న్యాయమూర్తి కే మారుతి దేవి,సివిల్ జడ్జి కే మురళీమోహన్ ముఖ్యఅతిధులుగా హాజరయ్యారు. ఆడవారిని గౌరవించడం పురాతనం నుండే మన సాంప్రదాయమని, స్త్రీ అంటేనే శక్తి స్వరూపిణి అని, దేవి శరన్నవరాత్రుల సందర్భంగా అమ్మవారి ఆశీస్సులు ప్రతి ఒక్కరికి ఉండాలని జిల్లా ప్రధాన న్యాయమూర్తి కే.మారుతీ దేవి మనస్ఫూర్తిగా కోరుకున్నారు.ఈ కార్యక్రమంలో సీనియర్ న్యాయవాదులు వంచ దామోదర్ రెడ్డి, బొబ్బల కేశవరెడ్డి, జి బాబురావు, నరసింహ యాదవ్, జి స్వామి, బొమ్మ వెంకటేష్, ఆకుల ఆంజనేయులు, పి. శ్రీధర్ ఎస్ రవికుమార్, అర్జున్, వేదేశ్ న్యాయవాదులు పాల్గొన్నారు.