నర్సయ్య గౌడ్ కోసం శబరిమలకు పాదయాత్ర

నర్సయ్య గౌడ్ కోసం శబరిమలకు పాదయాత్ర

ముద్ర ప్రతినిధి, బీబీనగర్: భువనగిరి ఎంపీగా బూర నర్సయ్య గౌడ్ వచ్చే ఎన్నికలలో గెలుపొందాలని కోరుతూ బీబీనగర్ మండలం అన్నంపట్ల గ్రామానికి చెందిన కసగోని వంశీగౌడ్ అయ్యప్ప ఇరుముడితో పెద్దపాదం వరకు పాదయాత్ర చేపట్టారు. ఈనెల 14న ఇరుముడి ధరించి బూర నర్సయ్య గౌడ్ ఫొటోను కలిగిన ప్లకార్డు పట్టుకుని శబరియాత్రకు బయల్దేరిన ఆయన గురువారం అయ్యప్ప దర్శనం చేసుకున్నారు. ఇరుముడి కార్యక్రమానికి నర్సయ్య గౌడ్ హాజరయ్యారు. భువనగిరి ఎంపీగా డాక్టర్ నర్సయ్య గౌడ్ గెలుపొందితే, హైదరాబాద్ నుంచి శబరిమలకు మహాపాదయాత్ర చేపడతానని వంశీగౌడ్ తెలిపారు.