పిఎసిఎస్ చైర్మన్ పై చర్యలు తీసుకోవాలి

పిఎసిఎస్ చైర్మన్ పై చర్యలు తీసుకోవాలి

భూదాన్ పోచంపల్లి,ముద్ర:- భూదాన్ పోచంపల్లి మండల పరిధిలోని జూలూరు గ్రామంలో  అవినీతికి పాల్పడిన జులురు పిఎసిఎస్ చైర్మన్ పై చర్యలు తీసుకోవాలని సంఘం మాజి డైరెక్టర్లు బొబ్బల బాలకృష్ణారెడ్డి, గట్టు రాంరెడ్డి, పాటి బుచ్చిరెడ్డి, వాకిటి మల్లారెడ్డి అన్నారు. మంగళవారం భువనగిరిలో డి సి ఓ ప్రవీణ్ కుమార్ ను కలిసి వినతి పత్రాన్ని అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ జూలూరు సొసైటీలో 44 లక్షల వరకు అవినీతి అక్రమాలు జరిగాయని ఆరోపించారు. ఎరువుల అమ్మకాలు, ధాన్యం కొనుగోలు పై వచ్చే కమిషన్లను గుట్టు చప్పుడు కాకుండా కాజేస్తున్న వారిని సంబంధిత అధికారులు పట్టించుకోవడంలేదని,  గతంలో ఎన్నోసార్లు అధికారులకు, ప్రజాప్రతినిధులకు వినతి పత్రాలు అందజేశామని తెలిపారు. అక్రమంగా కాజేసిన నిధులను రికవరీ చేసి అవినీతికి పాల్పడ్డ వారిపై చట్ట రీత్యా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో మాజీ డైరెక్టర్లు పకీరు జంగారెడ్డి, ఉడతల జంగయ్య, భారతమ్మ, పోన్నయ్య తదితరులు పాల్గొన్నారు.