నేడు తెలంగాణకు అమిత్ షా
![నేడు తెలంగాణకు అమిత్ షా](https://mudranews.in/uploads/images/2023/10/image_750x_6524eef1450a0.jpg)
- ఆదిలాబాద్ సభలో పాల్గొననున్న హోమ్మంత్రి
- ఐటీసీ కాకతీయలో బీజేపీ నేతలతో మీటింగ్
ముద్ర, తెలంగాణ బ్యూరో : కేంద్ర హోమ్మంత్రి అమిత్ షా తెలంగాణలో పర్యటించనున్నారు. ఈ మేరకు ఆయన అధికారిక షెడ్యుల్ ఖరారైంది. మంగళవారం అదిలాబాద్ లోని డైట్ కాలేజీ గ్రౌండ్స్ లో జరగనున్న బహిరంగ సభలో షా ప్రసంగించనున్నారు. అదే రోజు రాజేంద్ర నగర్ నియోజకవర్గం శంషాబాద్ లో నిర్వహించనున్న అమిత్ షా సభ రద్దయింది. దీనికి బదులుగా సికింద్రాబాద్సిఖ్ విలేజ్ లోని ఇంపీరియల్ గార్డెన్ లో జరిగే మేధావుల సదస్సులో అమిత్ షా పాల్గొంటారు. అనంతరం సాయంత్రం ఏడున్నర గంటలకు తెలంగాణ బీజేపీ ముఖ్య నేతలతో ఐటీసీ కాకతీయ హోటల్ సమావేశం కానున్నారు. తెలంగాణలో తన పర్యటనలో భాగంగా అమిత్ షా మంగళవారం ఢిల్లీ నుంచి మధ్యాహ్నం 1.45 గంటకు బేగంపేట విమానాశ్రయానికి చేరుకుంటారు. అక్కడ నుంచి మధ్యాహ్నం 2.35 గంటలకు ప్రత్యేక హెలికాప్టర్ లో ఆదిలాబాద్ చేరుకుంటారు. మధ్యాహ్నం 3 నుంచి 4 గంటలకు అదిలాబాద్ సభలో ఆయన పాల్గొంటారు. సభ ముగియగానే సాయంత్రం 4.15 గంటలకు అదిలాబాద్ నుంచి బేగంపేట విమానాశ్రయానికి చేరుకుంటారు. సాయంత్రం 5 గంటల నుంచి 5.20 వరకు ఐటీసీ కాకతీయలో విశ్రాంతి తీసుకుని అనంతరం సాయింత్రం 6 గంటలకు ఇంపీరియల్ గార్డెన్ కు చేరుకుంటారు. అక్కడ సాయింత్రం 6.20 నుంచి 7.20 వరకు మేధావుల సదస్సులో పాల్గొంటారు. రాత్రి ఏడున్నర గంటలకు ఐటీసీ కాకతీయలో బీజేపీ ముఖ్య నేతలతో భేటీ అవుతారు. రాత్రి 9.40 గంటలకు బేగంపేట విమానాశ్రయం నుంచి ఢిల్లీకి తిరిగి వెళ్తారు.