ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్కు సుకేశ్ చంద్రశేఖర్ మరో లేఖ
ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్కు సుకేశ్ చంద్రశేఖర్ మరో లేఖ రాశారు. తన అడ్వొకేట్ ద్వారా లేఖ విడుదల చేశారు. సీఎం కేజ్రీవాల్పై లెఫ్టినెంట్ గవర్నర్కు ఫిర్యాదు చేశారు. కేజ్రీవాల్ కోసం ఫర్నిచర్ను తానే కొనుగోలు చేశానని చెప్పారు. రూ. 45 లక్షతో 12 సీట్ల డైనింగ్ టేబుల్ కొన్నానని చెప్పారు. రూ. 34 లక్షలతో డ్రెస్సింగ్ టేబుల్స్ కొన్నానని అన్నారు. రూ. 18 లక్షలతో అద్దాలు, 28 లక్షలతో బెడ్రూమ్ సామగ్రి కొన్నానని అన్నారు. రూ. 45 లక్షలతో గోడ గడియారాలు తీసుకున్నానని తెలిపారు. ఇటలీ, ఫ్రాన్స్, ఢిల్లీ, ముంబైలో ఫర్నిచర్ కొనుగోలు చేసినట్లు తెలిపారు. ఫర్నిచర్ బిల్లులను దర్యాప్తు సంస్థలకు అందించానని అన్నారు. కేజ్రీవాల్ నివాసంలో ఉన్న ఫర్నిచర్ కొనుగోలుపై దర్యాప్తు సంస్థల ద్వారా విచారణ జరపాలన్నారు.