ఢిల్లీ లెఫ్టినెంట్​ గవర్నర్​కు సుకేశ్​ చంద్రశేఖర్​ మరో లేఖ 

ఢిల్లీ లెఫ్టినెంట్​ గవర్నర్​కు సుకేశ్​ చంద్రశేఖర్​ మరో లేఖ 

ఢిల్లీ లెఫ్టినెంట్​ గవర్నర్​కు సుకేశ్​ చంద్రశేఖర్​ మరో లేఖ రాశారు. తన అడ్వొకేట్​ ద్వారా లేఖ విడుదల చేశారు. సీఎం కేజ్రీవాల్​పై లెఫ్టినెంట్​ గవర్నర్​కు ఫిర్యాదు చేశారు. కేజ్రీవాల్​ కోసం ఫర్నిచర్​ను తానే కొనుగోలు చేశానని చెప్పారు. రూ. 45 లక్షతో 12 సీట్ల డైనింగ్​ టేబుల్​ కొన్నానని చెప్పారు. రూ. 34 లక్షలతో డ్రెస్సింగ్​ టేబుల్స్​ కొన్నానని అన్నారు. రూ. 18 లక్షలతో అద్దాలు, 28 లక్షలతో బెడ్​రూమ్​ సామగ్రి కొన్నానని అన్నారు. రూ. 45 లక్షలతో గోడ గడియారాలు తీసుకున్నానని తెలిపారు. ఇటలీ, ఫ్రాన్స్​, ఢిల్లీ, ముంబైలో ఫర్నిచర్​ కొనుగోలు చేసినట్లు తెలిపారు. ఫర్నిచర్​ బిల్లులను దర్యాప్తు సంస్థలకు అందించానని అన్నారు. కేజ్రీవాల్​ నివాసంలో ఉన్న ఫర్నిచర్​ కొనుగోలుపై దర్యాప్తు సంస్థల ద్వారా విచారణ జరపాలన్నారు.