కేంద్ర ప్రభుత్వ అభివృద్ధి, సంక్షేమ పథకాలు ప్రజలకు వివరించాలి 

కేంద్ర ప్రభుత్వ అభివృద్ధి, సంక్షేమ పథకాలు ప్రజలకు వివరించాలి 

బిజెపి రాష్ట్ర కార్యవర్గ సభ్యురాలు డా . బోగ శ్రావణి

ముద్ర ప్రతినిధి, జగిత్యాల: గావ్ చలో బస్తీ చలో కార్యక్రమంలో  వివిధ సంఘాల  కవులు, కళాకారులు, క్రీడాకారులను, కలిసి కేంద్ర ప్రభుత్వ అభివృద్ధి, సంక్షేమ పథకాల గురించి వివరించి ఆ వార్డ్ లోని సమస్యల గురించి చర్చలు జరపాలని బిజెపి రాష్ట్ర కార్యవర్గ సభ్యురాలు, జగిత్యాల నియోజకవర్గ ఇంచార్జి డా . బోగ శ్రావణి పేర్కొన్నారు. గావ్ చలో బస్తీ చలో  అభియాన్ కార్యక్రమంలో భాగంగా జగిత్యాల పట్టణ ప్రవాసి ఈ కార్యకర్తల సమావేశంలో ముఖ్య అతిథిగా  బోగ శ్రావణి మాట్లాడుతూ పేదల సంక్షేమం మహిళా సాధికారత అంతర్గత బాహ్య భద్రత సాంస్కృతిక పునరుద్ధరణ విదేశాల్లో భారతదేశ గౌరవాన్ని పెంచడం వంటి  అనేక రంగాలలో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ నాయకత్వంలో బిజెపి నేతృత్వంలో కేంద్ర ప్రభుత్వం గత 10 సంవత్సరాలుగా ఊహకు కూడా అందని సాధారణ అభివృద్ధి సాధించిందని అన్నారు.

 అభివృద్ధి దార్శనిగతకు కేంద్ర రాష్ట్ర బీజేపీ ప్రభుత్వాలు చేస్తున్న సంక్షేమ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లడం ద్వారా 2024 లోక్సభ ఎన్నికల్లో ప్రజల మద్దతు కూడగొట్టి యావత్ దేశ ప్రజలను విశ్వాసాన్ని చురగొనాలన్నారు. ఈ కార్యక్రమంలో జగిత్యాల పట్టణ ప్రధాన కార్యదర్శి ఆముదరాజు, సిరికొండ రాజన్న,రంగు గోపాల్, కన్వీనర్ గాదాసు రాజేందర్, కో కన్వీనర్ బడే శంకరన్న, పవన్ సింగ్, బైరి రాజేందర్, మామిడాల రాజగోపాల్, మర్రిపల్లి సాగర్ మమత, లక్ష్మి, పుష్ప, మధురిమ బూత్ అధ్యక్షులు మరియు బిజెపి నాయకులు కార్యకర్తలు పట్టణ పదాధికారులు, తదితరులు పాల్గొన్నారు.