జిల్లా కేంద్రంలో యాదవ భవనం నిర్మించాలి- ఎమ్మెల్సీ కవితకు యాదవుల వినతి

జిల్లా కేంద్రంలో యాదవ భవనం నిర్మించాలి- ఎమ్మెల్సీ కవితకు యాదవుల వినతి

మెట్‌పల్లి ముద్ర: జగిత్యాల జిల్లా కేంద్రంలో యాదవ భవనం నిర్మాణం చేపట్టేందుకు సహకరించాలని. ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత కు జిల్లాకు చెందిన యాదవులు వినతి పత్రం అందజేశారు. బుధవారం నిజామాబాద్ లో ఎమ్మెల్సీ కవితను యాదవులు మర్యాద పూర్వకంగా కలిశారు. జిల్లా కేంద్రంలో యాదవ భవన నిర్మాణం తో పాటు ఎస్ ఐ అనిల్ కుమార్ యాదవ్ పై సస్పెన్షన్ ఎత్తివేసి ఉద్యోగం లోకి తీసుకునేలా చొరవ చూపాలని కోరినట్లు తెలిపారు. అఖిల భారత యాదవ మహాసభ సంఘం జిల్లా అధ్యక్షులు పలుమార్ మల్లేష్ యాదవ్, జిల్లా ఉపాధ్యక్షులు బండ మల్లేష్ యాదవ్, కోరుట్ల నియోజకవర్గం అధ్యక్షులు లక్కం మల్లేష్ యాదవ్, మల్లాపూర్ మండల అధ్యక్షులు సంఘ గంగారాజం యాదవ్, మల్లాపూర్ మండల గౌరవ అధ్యక్షులు డిఎస్ సంతోష్ యాదవ్ లు ఉన్నారు