కొత్త పార్లమెంటు భవనం ప్రారంభోత్సవానికి దూరంగా బీఆర్​ఎస్

కొత్త పార్లమెంటు భవనం ప్రారంభోత్సవానికి దూరంగా బీఆర్​ఎస్

కొత్త పార్లమెంటు భవనం ప్రారంభోత్సవానికి దూరంగా ఉండాలని బీఆర్​ఎస్​ నిర్ణయించింది. ఆదివారం పార్లమెంటు భవనాన్ని ప్రధాని మోదీ ప్రారంభించనున్నారు. ఇప్పటికే దేశంలోని 19 పార్టీలు ప్రారంభోత్సవానికి వెళ్లకూడదని నిర్ణయించాయి. ఇప్పుడు ఆ జాబితాలో బీఆర్​ఎస్​ కూడా చేరింది. రేపు బీఆర్ఎస్​ తన నిర్ణయాన్ని అధికారికంగా వెల్లడించే అవకాశం ఉంది.