నాగర్ కర్నూల్ జిల్లా లో బిఆర్ఎస్ కు షాక్...

నాగర్ కర్నూల్ జిల్లా లో బిఆర్ఎస్ కు షాక్...
  • బిజెపిలోకి  బిఆర్ఎస్   ఎంపి పోతుగంటి రాములు, బిఆర్ఎస్  జక్క రఘునందన్ రెడ్డి, బిఆర్ఎస్ జెడ్పిటిసి పోతుగంటి భరత్

ముద్ర ప్రతినిధి నాగర్‌కర్నూల్:- ఎంపీ పోతుగంటి రాములు బీఆర్ఎస్ పార్టీని వీడుతున్నారు. తన కొడుకు కల్వకుర్తి జెడ్పీటీసీ భరత్ ప్రసాద్ కు ఎంపీ టికెట్ కోసం బీఆర్ఎస్ లో ఆశించినా హామీ లభించలేదు. ఇప్పటికే జెడ్పీ ఛైర్మన్ విషయంలో రాములుతో పాటుగా బీఆర్ఎస్ పార్టీలో దూరం పెరిగింది. అచ్చంపేటలోనూ మాజీ ఎమ్మెల్యే గువ్వల బాలరాజుతోనూ సఖ్యత లేదు.  

ఈ పరిణామలు ఇలా ఉంటే.. ఇటీవల కేటీఆర్ హాజరైన సమావేశానికి కూడా రాములుకు ఆహ్వానం  ఇవ్వలేదు. దీంతో అసహనంతో ఉన్న రాములు చివరకు బీఆర్ఎస్ పార్టీని వీడేందుకు సిద్దమయ్యారు. తన కొడుకు, జెడ్పీటీసీ భరత్ కు ఎంపీ టికెట్ హామీతో రాములు ఆ పార్టీలో చేరేందుకు సిద్దమయ్యారని తెలుస్తుంది. రాములుకు పార్లమెంట్ పరిధిలో మంచి పట్టు ఉంది. ఈ పరిస్థితులు బీఆర్ఎస్ కు షాక్ కలిగించనుంది. రాములు ఇప్పటికే ఢిల్లీకి వెళ్లారని, గురువారం బీజేపీ జాతీయ అధ్యక్షులు జేపీ నడ్డా సమక్షంలో బీజేపీ తీర్థం పుచ్చుకోనున్నారు.