బాధను దిగమింగుకొని బాలిక "ఇంటర్ మీడియట్" పరీక్షకు హాజరు

బాధను దిగమింగుకొని బాలిక "ఇంటర్ మీడియట్" పరీక్షకు హాజరు

వెల్గటూర్, ముద్ర : జగిత్యాల జిల్లా, ఎండపల్లి మండలంలోని ముంజంపల్లి గ్రామానికి చెందిన మున్నాల సృష్టిత  తన తాత మున్నాల రాజయ్య బుధవారం అనారోగ్యంతో మృతి చెందాడు. కాగా తాత శవం ఇంటిముందు ఉంచుకొని బాధను దిగమింగుకొని సృష్టిత వెల్గటూర్ మండలంలోని కుమ్మరి పల్లెలో గల "ఆదర్శ పాఠశాలలో"  ఇంటర్మీడియట్ ప్రథమ సంవత్సరం (తెలుగు ) పరీక్షకు హాజరయ్యింది. కాగా సృష్టిత వెల్గటూర్ మండలంలోని కుమ్మరిపల్లెలో గల ఆదర్శ పాఠశాలలో ఇంటర్మీడియట్ చదువుతుంది.  తెలుగు పరీక్ష రాసిన అనంతరం ఇంటికి వెళ్లి దాన సంస్కరణల కార్యక్రమంలో పాల్గొంది.