సీఎం కేసీఆర్ సభలో బుల్లెట్ల కలకలం

సీఎం కేసీఆర్ సభలో బుల్లెట్ల కలకలం

 మెదక్: ప్రజా ఆశీర్వాద సభలో భాగంగా ముఖ్యమంత్రి, టిఆర్ఎస్ అధినేత కే చంద్రశేఖర రావు గురువారం సాయంత్రం నర్సాపూర్ లో పాల్గొన్న సభలో ఒక వ్యక్తి వద్ద రెండు బుల్లెట్లు లభించడంతో కలకలం ఏర్పడింది. అస్లాం అనే వ్యక్తి నుంచి పోలీసులు రెండు బుల్లెట్లు స్వాధీనం చేసుకున్నారు. నర్సాపూర్ సభా ప్రాంగణంలోకి మీడియా పేరిట ప్రవేశిస్తున్న అస్లాంను పోలీసులు తనిఖీ చేశారు. అతడు జేబులో నుంచి కార్డు తీసే క్రమంలో రెండు బుల్లెట్లు జేబు నుంచి కింద పడ్డాయి. దా నితో అతన్ని పోలీసులు అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు.