బాల్క సుమన్ దిష్టిబొమ్మ దగ్ధం

బాల్క సుమన్ దిష్టిబొమ్మ దగ్ధం

ఆలేరు (ముద్ర న్యూస్): తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పై బిఆర్ఎస్ నాయకులు బాల్క సుమన్ అనుచిత వ్యాఖ్యలను నిరసిస్తూ మంగళవారం  యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరు పట్టణ కేంద్రంలొని రైల్వే స్టేషన్ సమీపంలో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో బాల్క సుమన్ దిష్టిబొమ్మను దగ్ధం చేశారు. ఈ సందర్భంగా మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు కోండ్రాజు వెంకటేశ్వరరాజు, పట్టణ అధ్యక్షులు ఎంఏ ఎజాజ్, యువజన కాంగ్రెస్ మండల అధ్యక్షులు ఉట్కూరి సురేష్ గౌడ్ లు మాట్లాడుతూ నిరంతరం ప్రజల కోసం పరితపిస్తూ ప్రజల అభివృద్ధి కోసం అహర్నిశలు కృషి చేస్తున్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పై వ్యాఖ్యలు చేసే స్థాయి బాల్క సుమన్ కు లేదు అని అన్నారు. వెంటనే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పై చేసిన అనుచిత వ్యాఖ్యలను వెనక్కి తీసుకొని దేశరత్తుగా క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు, చూసుకుంటే కాంగ్రెస్ పార్టీ శ్రేణులు తగిన బుద్ధి చెబుతారని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో ఎంపీటీసీ సంఘం జిల్లా ఉపాధ్యక్షులు ఆరే ప్రశాంత్ గౌడ్, మాజీ ఎంపీటీసీ సభ్యులు ఎండి జైనోద్దీన్, నాయకులు ఎమ్ ఎస్ విజయ్ కుమార్, పల్లె సంతోష్ గౌడ్, గాజుల వెంకటేష్ యాదవ్, ముదిగొండ శ్రీకాంత్, దూసరి మురళి గౌడ్, పర్రె రమేష్, భార్గవ్, కర్రె అజయ్ కుమార్, ఎగ్గిడి శ్రీశైలం, జేట్ట సిద్ధులు పాల్గొన్నారు.