అవినీతిని ప్రోత్సహిస్తున్న సీఎం
![అవినీతిని ప్రోత్సహిస్తున్న సీఎం](https://mudranews.in/uploads/images/2023/05/image_750x_64590b8af2b19.jpg)
మహాజన సోషలిస్ట్ పార్టీ ఆరోపణ
స్టేషన్ ఘన్ పూర్, ముద్ర: దళిత బంధు అమలులో ఎమ్మెల్యేల చేతి వాటాన్ని వెనకేసుకొస్తున్న ముఖ్యమంత్రి కెసిఆర్ అవినీతిని ప్రోత్సహిస్తున్నారని మహాజన సోషలిస్టు పార్టీ నియోజకవర్గ నాయకులు రడపాక ఆదాం ఆరోపించారు. దళిత బంధు లబ్ధిదారుల నుండి రెండు మూడు లక్షలు లంచంగా తీసుకున్న మొత్తాన్ని తిరిగి ఇవ్వాలని డిమాండ్ తో మహాజన సోషలిస్ట్ పార్టీ చేపట్టిన నిరసన దీక్ష సోమవారం నాటికి ఏడో రోజుకు చేరింది. ఈ సందర్భంగా ఆదాము మాట్లాడుతూ లంచంగా తీసుకున్న డబ్బులు తిరిగి ఇప్పించకుండా వారిని కాపాడడం అంటే అవినీతిని ప్రోత్సహించడమే అన్నారు.
అవినీతి చెస్తే కన్న కొడుకునైనా ఉపేక్షించమన్న కేసీఆర్ దళిత బందులో అవినీతి చేసిన ఎమ్మెల్యేలపై చర్యలు తీసుకోకపోవడంలో ఆంతర్యమేంటనీ, అవినీతి ఎమ్మెల్యేల చిట్టా బహిర్గతం చేయకపోవడం అవినీతిని పెంచి పోషించడమేనని అన్నారు. ఈ కార్యక్రమంలో మహాజన సోషలిస్ట్ పార్టీ జనగామ జిల్లా నాయకులు జేరిపోతుల సుధాకర్, సందేన రవీందర్, నలిమెల నాగరాజు, చాడ ఏలియా, ఎంఎస్పీ వివిధ మండలాల నాయకులు గాదె శ్రీధర్, ఆరూరి శ్రీనివాస్, గుర్రం నవీన్, గాదె రామచందర్ తదితరులు పాల్గొన్నారు.