చంద్రబాబు నాయుడు ఐడియాలజీ కాన్సెప్ట్
టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు జన్మదినం సందర్భంగా ఐడియాలజీ కాన్సెప్ట్ ప్రకటించారు. మార్కాపురంలో ఐడియాలజీ కాన్సెప్ట్ విడుదల చేశారు. పేదలను సంపన్నులను చేయడమే లక్ష్యమన్న చంద్రబాబు. ప్రపంచంలో తెలుగువారు ఎక్కడ ఉన్నా నెంబర్1 గా నిలవాలన్న సంకల్పం ఉండాలన్నారు. సాధారణ మహిళలు, పిల్లలతో కాన్సెప్ట్ విడుదల చేయించిన చంద్రబాబు. ఈ రెండు సంకల్పాలపై దృష్టి సారించనున్నట్లు చంద్రబాబు ప్రకటించారు.
గతంలో జన్మభూమి ద్వారా గ్రామాలను అభివృద్ధి చేసుకున్నామన్నారు. ఇప్పుడు ప్రణాళికాబద్ధంగా పనిచేసి ప్రజల జీవితాలను మారుద్దామన్నారు. సంపన్నులు తోటివారికి మెంటార్గా నిలవాలన్నారు. సాయం అందించడం ద్వారా జీవితాల్లో మార్పు తేవాలి. ఆర్థిక అసమానతలు లేని సమాజం కోసం పనిచేద్దాం. అధికారంలోకి వచ్చిన వెంటనే ప్రత్యేక పాలసీ రూపొందిస్తాం. టెక్నాలజీ ద్వారా కుటుంబాలను యూనిట్గా తీసుకొని ప్రజల జీవితాల్లో మార్పు తెస్తామన్న చంద్రబాబు.