కాంగ్రెస్ అభ్యర్థి రోహిత్ ను అడ్డుకున్న కాలనీ వాసులు

కాంగ్రెస్ అభ్యర్థి రోహిత్ ను అడ్డుకున్న కాలనీ వాసులు

ముద్ర ప్రతినిధి, మెదక్:-మెదక్ జిల్లా రామాయంపేట ఎస్సీ కాలనీలో ఎన్నికాల ప్రచారానికి వెళ్లిన మెదక్ కాంగ్రెస్ అభ్యర్థి మైనంపల్లి రోహిత్ రావును రావద్దంటూ బిఆర్ఎస్ శ్రేణులు  అడ్డుకున్నారు. ఈ సందర్బంగా ఎస్సీ కాలనీలో ఉద్రిక్తత వాతావరణ చోటు చేసుకుంది. ఎస్సీ కాలనీలోకి రావద్దంటూ బిఅర్ఎస్ నాయకులు నినాదాలు చేశారు. రామయంపేట రెవెన్యూ డివిజన్ కోసం వెళ్లిన మొట్టమొదటి వ్యక్తినినేనే. నేను వచ్చిన తరువాత రెవెన్యూ డివిజన్ ఇచ్చారని రోహిత్ పేర్కొన్నారు. పది సంవత్సరాలుగా ఎమ్మెల్యే పద్మాదేవేందర్ రెడ్డి ఎక్కడికి వెళ్లారని ప్రశ్నించారు.10 సంవత్సరాల పరిపాలనలోమెదక్ రింగ్ రోడ్డు ఏమైంది,నిజాం షుగర్స్ ఫ్యాక్టరీని ఎందుకు తెరిపించలేదన్నారు.పది సంవత్సరాలు పరిపాలించిన బిఆర్ఎస్ వాళ్ళను అడ్డుకోవాలి కానీ ప్రజాసేవ చేసేవాళ్లను అడ్డుకోకూడదన్నారు.బిఆర్ఎస్ శ్రేణులు అడ్డుకుంటే ప్రచారం ఆగదన్నారు.