కొమ్మూరిపై హైకమాండ్‌కు ఫిర్యాదు

కొమ్మూరిపై హైకమాండ్‌కు ఫిర్యాదు

ముద్ర ప్రతినిధి, జనగామ: తన వ్యక్తిగత ఇమేజ్‌ కోసం కాంగ్రెస్‌ పార్టీ పేరు వాడుకుంటూ ఇష్టానుసారంగా వ్యవహరిస్తున్న మాజీ ఎమ్మెల్యే కొమ్మూరి ప్రతాప్‌ రెడ్డి పార్టీ హైకమాండ్‌ ఫిద్యాదు చేయనున్నట్లు కాంగ్రెస్‌ జనగామ మండల అధ్యక్షులు కొన్నే మహేందర్ రెడ్డి తెలిపారు. సోమవారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ జనగామ నియోజకవర్గంలో మండల నాయకులతో పీసీసీ మాజీ అధ్యక్షుడు పొన్నాల లక్ష్మయ్య హాత్ సే హాత్ జోడో యాత్ర నిర్వహించినట్లు తెలిపారు. కొమ్మూరి ప్రతాప్ రెడ్డి జనగామ మండల, జిల్లా కమిటీ సభ్యులు, అనుబంధ సంఘం నాయకులకు సమాచారం ఇవ్వకుండా యాత్ర పేరుతో పార్టీ వ్యతిరేక కార్యక్రమాలకు పాల్పడుతున్నాడని ఆరోపించారు.

పెద్దారాంచర్లలో గ్రామ శాఖ నాయకులు కొమ్మూరి యాత్రను బహిష్కరించారని తెలిపారు. పార్టీని బ్రష్టు పట్టించేలా వ్యవహరిస్తున్న ఆయన తీరుపై పార్టీ అధిష్టానానికి, క్రమ శిక్షణ కమిటీ, టీపీసీసీ  మాజీ అధ్యక్షుడు పొన్నాల లక్ష్మయ్యకు కంప్లైంట్ చేయనున్నట్లు చెప్పారు. సమావేశంలో మండల సీనియర్ నాయకులు కట్ట కృష్ణ, మండల ఉపాధ్యక్షులు గుజుల మధు, వట్నాల రామకృష్ణ, సర్వర్, మండల ప్రధాన కార్యదర్శి సలెంద్ర శ్రీనివాస్, బీసీ సెల్ మండల అధ్యక్షుడు కురాకుల నాగరాజు, మైనార్టీ సెల్ మండల అధ్యక్షలు యాసిన్, యూత్ కాంగ్రెస్ నాయకులు బత్తిని నిఖిల్, కర్రే పరుశురాములు, ఎల్లయ్య పాల్గొన్నారు.