ఘనంగా కాంగ్రెస్ పార్టీ ఆవిర్భావ దినోత్సవం

ఘనంగా కాంగ్రెస్ పార్టీ ఆవిర్భావ దినోత్సవం
  • మెదక్ లో జెండా ఆవిష్కరించిన ఎమ్మెల్యే రోహిత్

ముద్ర ప్రతినిధి, మెదక్:జిల్లా కేంద్రం మెదక్ పట్టణంలో కాంగ్రెస్ పార్టీ 138 ఆవిర్భావ దినోత్సవం వేడుకలు గురువారం వైభవంగా నిర్వహించారు. పట్టణంలోని రాందాస్ చౌరస్తాలో కాంగ్రెస్ పార్టీ జెండాను ఎమ్మెల్యే డాక్టర్ రోహిత్ ఆవిష్కరించారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలకు శుభాకాంక్షలు తెలిపారు.  మిఠాయిలు పంచారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు శ్రీనివాస్ చౌదరి, పార్టీ అధ్యక్షులు గూడూరు ఆంజనేయులు గౌడ్, కౌన్సిలర్ అవారి శేఖర్,ఎండి.హఫీసుద్దీన్, సమీయుల్లాఖాన్, బొజ్జ పవన్, గోదల జ్యోతి, అరవింద్ గౌడ్, దాయర రవి, ముజీబ్, హరిత, అశోక్ రెడ్డి, ఐతారం నర్సింలు, గాడి రమేష్ తదితరులు పాల్గొన్నారు. అంతకు ముందు గాంధీ మహాత్ముని విగ్రహానికి పూలమాలలు వేసి ఎమ్మెల్యే రోహిత్ నివాళులు అర్పించారు.