ఎస్సీ గురుకుల హాస్టల్ లో నూతన డార్మెటరీ నిర్మించండి : బర్రె జహంగీర్

ఎస్సీ గురుకుల హాస్టల్ లో నూతన డార్మెటరీ నిర్మించండి : బర్రె జహంగీర్

ముద్ర ప్రతినిధి భువనగిరి: యాదాద్రి భువనగిరి జిల్లా కేంద్రం భువనగిరి పట్టణంలో ఉన్న సాంఘిక సంక్షేమ రెసిడెన్షియల్  పాఠశాల  హాస్టల్ బిల్డింగ్ శిథిల అవస్థలో ఉన్న బిల్డింగ్ ను వెంటనే డిస్మెంటల్ చేసి నూతన హాస్టల్ బిల్డింగ్ ని ఏర్పాటు చేయాలని  మాజీ మున్సిపల్ చైర్మన్ బర్రె జహంగీర్ డిమాండ్ చేశారు. శనివారం  శిథిలావస్థలో ఉన్న భవనాన్ని సందర్శించారు. సందర్భంగా ఆయన మాట్లాడుతూ తక్షణమే డార్మెటరీ రూమ్ లో ఉన్న విద్యార్థులను వెంటనే వేరే రూమ్ లోకి మార్చాలన్నారు. 

రెసిడెన్షియల్ స్కూల్ లో మౌలిక వసతులు కల్పించాలని డిమాండ్ చేశారు. సందర్శించిన వారిలో దళిత ఐక్య వేదిక జిల్లా అధ్యక్షుడు బట్టు రామచంద్రయ్య, పీపుల్స్ మానిటరింగ్ కమిటి సభ్యులు PMC రాష్ట్ర కన్వీనర్ సిర్పంగా శివలింగం, 23 వ వార్డ్ కౌన్సిలర్ పడిగల రేణుక ప్రదీప్,  ఎమ్మార్పీఎస్ రాష్ట్ర సహాయ కార్యదర్శి ఇటుకల దేవేందర్ మాదిగ, ఎమ్మార్పీఎస్  నాయకులు బొడ్డు శ్రవణ్ కుమార్ మాదిగ, చౌటుప్పల్ మున్సిపల్ ప్రధాన కార్యదర్శి బోదుల లింగస్వామి మాదిగలు పాల్గొన్నారు.