పుస్తే మట్టెలు అందజేసిన దరిపల్లి చంద్రం

పుస్తే మట్టెలు అందజేసిన దరిపల్లి చంద్రం

ముద్ర ప్రతినిధి: సిద్దిపేట సిద్దిపేట జిల్లా మద్దూరు మండలం వంగపల్లికి చెందిన నిరుపేద కుటుంబానికి తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ సభ్యుడు దరిపల్లి చంద్రం పుస్తె మట్టెలు అందజేశారు. లక్ష్మీ,పోశయ్య దంపతుల కూతురు సంధ్యారాణి వివాహ నిమిత్తం శనివారం స్వయంగా తానే పోశయ్య ఇంటికి వెళ్లి ఆ కుటుంబ సభ్యులకు పుస్తే మట్టెలు అందజేసి సంధ్యారాణి వివాహం ఏ ఆటంకాలు లేకుండా ఆనందంగా జరగాలని వారి వైవాహిక జీవితం సుఖసంతోషాలతో కొనసాగాలని ఆకాంక్షించారు.

పేదలకు సేవ చేయడంలోనే ఎంతో సంతృప్తి లభిస్తుందని ఇప్పుడు తాను చేసిన ఈ సేవా కార్యక్రమం కూడా చాలా చిన్నపాటిదేనని ఇక ముందు కూడా పేదవారికి పలు రకాలుగా సహాయ సహకారాలు అందించడానికి తాను ఎప్పుడూ కూడా సిద్ధంగా ఉంటానని ఇబ్బందుల్లో ఉన్నవారు తనని సంప్రదించాలని తెలిపారు.