బీబీసీకి ఢిల్లీ హైకోర్టు సమన్లు
![బీబీసీకి ఢిల్లీ హైకోర్టు సమన్లు](https://mudranews.in/uploads/images/2023/05/image_750x_646b4c32eaa2e.jpg)
ఇండియా.. ద మోడీ క్వశ్చన్ డాక్యుమెంటరీ ప్రసారం చేసిన అంశంలో బీబీసీకి ఢిల్లీ హైకోర్టు సమన్లు జారీ చేసింది. ఈ డాక్యుమెంటరీతో దేశం పరువు తీశారని బీబీసీపై ఓ ఎన్జీవో పరవునష్టం కేసును దాఖలు చేసింది. గుజరాత్కు చెందిన ఎన్జీవో జస్టిస్ ఫర్ ట్రయల్ సంస్థ కోర్టులో కేసు వేసింది. ఈ అంశంలో వివరణ ఇవ్వాలని కోరుతూ జస్టిస్ సచిన్ దత్త బీబీసీకి నోటీసులు ఇచ్చారు. బీబీసీ ఇండియా స్థానిక ఆపరేటర్ అని, బీబీసీ యూకే ఆ డాక్యుమెంటరీని రిలీజ్ చేసినట్లు పరువునష్టం దావాలో తెలిపారు. ఎన్జీవో తరపున సీనియర్ అడ్వొకేట్ హరీశ్ సాల్వే వాదించారు. దేశ న్యాయవ్యవస్థను కించపరిచే రీతిలో ఆ డాక్యుమెంటరీ ఉన్నట్లు దావాలో పేర్కొన్నారు. ఈ కేసులో సెప్టెంబర్ 15వ తేదీన తదుపరి విచారణ చేపడతారు.