బీబీసీకి ఢిల్లీ హైకోర్టు స‌మ‌న్లు

బీబీసీకి ఢిల్లీ హైకోర్టు స‌మ‌న్లు

ఇండియా.. ద మోడీ క్వశ్చన్​ డాక్యుమెంట‌రీ ప్రసారం  చేసిన అంశంలో బీబీసీకి ఢిల్లీ హైకోర్టు స‌మ‌న్లు జారీ చేసింది.  ఈ డాక్యుమెంట‌రీతో దేశం ప‌రువు తీశార‌ని బీబీసీపై ఓ ఎన్జీవో ప‌ర‌వునష్టం కేసును దాఖ‌లు చేసింది. గుజ‌రాత్‌కు చెందిన ఎన్జీవో జ‌స్టిస్ ఫ‌ర్ ట్రయల్​ సంస్థ కోర్టులో కేసు వేసింది. ఈ అంశంలో వివ‌ర‌ణ ఇవ్వాల‌ని కోరుతూ జ‌స్టిస్ స‌చిన్ ద‌త్త బీబీసీకి నోటీసులు ఇచ్చారు.  బీబీసీ ఇండియా స్థానిక ఆప‌రేట‌ర్ అని, బీబీసీ యూకే ఆ డాక్యుమెంట‌రీని రిలీజ్ చేసిన‌ట్లు ప‌రువున‌ష్టం దావాలో తెలిపారు. ఎన్జీవో త‌ర‌పున సీనియ‌ర్ అడ్వొకేట్​  హ‌రీశ్ సాల్వే వాదించారు. దేశ న్యాయ‌వ్యవస్థను  కించ‌ప‌రిచే రీతిలో ఆ డాక్యుమెంట‌రీ  ఉన్నట్లు  దావాలో పేర్కొన్నారు. ఈ కేసులో సెప్టెంబ‌ర్ 15వ తేదీన తదుప‌రి విచార‌ణ చేపడతారు.