మంచిర్యాల లో క్యాన్సర్ నిర్ధారణ పరీక్షలు

మంచిర్యాల లో క్యాన్సర్ నిర్ధారణ పరీక్షలు

మంచిర్యాల, ముద్ర, ప్రతినిధి: మంచిర్యాల లోని రెడ్డి కాలనిలోని శ్రీ సత్యసాయి మందిరంలో క్యాన్సర్ నిర్ధారణ పరీక్షా కేంద్రం ఏర్పాటు చేశారు. గురువారం శ్రీ సత్య సాయి సేవ సమితి మహిళా విభాగం, హైదరాబాద్ లోని ఎం.ఎన్.జె.క్యాన్సర్ ఆసుపత్రి సంయుక్తంగా క్యాన్సర్ నిర్ధారణ కేంద్రం ఏర్పాటు చేశారు. 

మంచిర్యాల జిల్లాలోని వివిధ ప్రాంతాలకు చెందిన మహిళలు వైద్య పరీక్షలు చేసుకోవడానికి తరలివచ్చారు. ఈ కార్యక్రమంలో శ్రీ సత్యసాయి సేవ సమితి రాష్ట్ర అధ్యక్షుడు వెంకట్ రావు, మహిళా విభాగం రాష్ట్ర సమన్వయకర్త గీతా పావని, ఎమ్. ఎన్. జె క్యాన్సరు ఆసుపత్రి కోఆర్డినేటర్ ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.