బిసి విద్యార్థి సంఘం అధ్వర్యంలో ఖమ్మంపల్లి  ప్రభుత్వ పాఠశాల లో పదవ తరగతి విద్యార్థులకి పరీక్ష ప్యాడ్స్, పెన్స్ లని పంపిణీ 

బిసి విద్యార్థి సంఘం అధ్వర్యంలో ఖమ్మంపల్లి  ప్రభుత్వ పాఠశాల లో పదవ తరగతి విద్యార్థులకి పరీక్ష ప్యాడ్స్, పెన్స్ లని పంపిణీ 

ముద్ర ముత్తారం: మండలంలోని ఖమ్మంపల్లి గ్రామంలోని ప్రభుత్వ పాఠశాలలో పదవ తరగతి చదువుతున్న విద్యార్థులకు బిసి విద్యార్థి సంఘం ఉమ్మడి కరీంనగర్ జిల్లా అధ్యక్షులు నారోజు రాకేష్ చారి ఆదేశాల మేరకు విద్యార్థిని,  విద్యార్థులకు పరీక్ష సమయంలో ఉపయోగ పడే పెన్స్ మరియు పరీక్ష  ప్యాడ్స్ లను ఖమ్మంపల్లికి చెందిన బీసీ సంఘం నాయకుడు రాఘవాచారి అందజేశారు. ఈ సందర్భంగా రాఘవచారి మాట్లాడుతూ బిసి విద్యార్థి సంఘం ఉమ్మడి కరీంనగర్ జిల్లా అధ్యక్షులు రాకేశ్ చారి 10వ తరగతి ఉత్తీర్ణత లో 10 జిపియే సాదించిన విద్యార్థులకు మొదటి బహుమతి గా రూ. 5016 లు అందిస్తానన్నాని తెలిపారని, పేద విద్యార్థులు కష్టపడి చదువుకొని మంచి జీపీఏ సాధించి, ఉన్నత చదువులు చదువుకొని గ్రామ అభివృద్ధికి పాటుపడాలని రాఘవచారి తెలిపారు. ఈ కార్యక్రమంలో బిసి విద్యార్థి సంఘం నాయకులు రాఘవచారితో పాటు విశ్వరామ్ గౌడ్, రాకేష్, సాయిరాం తదితరులు పాల్గొన్నారు.