ఎరువుల దుకాణాలను తనిఖీ చేసిన జిల్లా వ్యవసాయ అధికారి వాణీ

ఎరువుల దుకాణాలను తనిఖీ చేసిన జిల్లా వ్యవసాయ అధికారి వాణీ

ముద్ర, కోరుట్ల:కోరుట్ల మండలం లోని ఎరువుల దుకాణాలను జిల్లా వ్యవసాయ అధికారి వాణీ తనిఖీ చేశారు, ఈ సందర్భంగా ఎరువుల డీలర్లకు అన్ని రిజిస్టరు సక్రమంగా ఉండాలని ఆదేశించారు. రైతులు తీసుకున్న మందులు యూరియాకు రసీదులు ఇవ్వాలని తెలిపారు.అదేవిధంగా మండలం లోని ఐలాపూర్ గ్రామం లోని జీరో టిల్లేజ్ మొక్కజొన్న పంటను సందర్శించారు. మొక్కజొన్న పంటలో కత్తెర పురుగు వలన ఎక్కువ నష్టం వాటిల్లే అవకాశం ఉన్నందున ఇమామెక్టిన్ బెంజోఏట్ లేదా కోరాజెన్ ఏదైనా ఒక మందును పిచికారి చేయాలని కోరారు.ఈ కార్యక్రమంలో జిల్లా వ్యవసాయ అధికారి వాణీ, మండల వ్యవసాయ అధికారి నాగమణి, ఎఇఓ మమత మరియు గ్రామ రైతులు పాల్గొన్నారు.