ఫిర్యాదుల పరిష్కారానికి చర్యలు తీసుకోవాలి జిల్లా కలెక్టర్ అనుదీప్

ఫిర్యాదుల పరిష్కారానికి చర్యలు తీసుకోవాలి జిల్లా కలెక్టర్ అనుదీప్
District Collector Anudeep

ముద్ర ప్రతినిధి, భద్రాద్రి కొత్తగూడెం: ప్రజావాణిలో వచ్చిన ఫిర్యాదుల పరిష్కారానికి అధికారులు చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ అనుదీప్ ఆదేశించారు. సోమవారం ఐడిఓసి కార్యాలయపు సమావేశపు హాలులో అన్ని శాఖల అధికారులతో ప్రజావాణి నిర్వహించి జిల్లాలోని వివిధ ప్రాంతాల నుండి వచ్చిన ప్రజల నుండి వినత సేకరించి పరిష్కారానికి చర్యలు చేపట్టాలని సూచించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ప్రజావాణిలో సమస్య పరిష్కరించాలని ప్రజలు చేసిన దరఖాస్తుల పరిష్కారానికి అధికారులు ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలన్నారు.

రానున్న ప్రజావాణిలో పరిష్కారానికి చేపట్టిన చర్యలపై  సమీక్షించినట్లు ఆయన తెలిపారు. ప్రజావాణి కార్యక్రమానికి గైర్హాజరైన మృత్య శాఖ అధికారికి, కాలుష్య నియంత్రణ మండలికి షోకాజ్ నోటీసులు జారీ చేయాలని డిఆర్ఓకు సూచించారు. మండలం జగన్నాధపురం కొత్తగూడెం మున్సిపాలిటీ  గొల్లగూడెం ,మేదర బస్తి , చంద్రుగొండ , దమ్మపేట , బూర్గంపాడు మండలాలతోపాటు వివిధ గ్రామాలకు చెందిన ప్రజలు ప్రజావాణిలో తమ సమస్యలు పరిష్కరించాలని వింత పత్రాలను అందజేశారు. ప్రజావాణి కార్యక్రమంలో అదనపు కలెక్టర్ వెంకటేశ్వర్లు, అన్ని శాఖల జిల్లా అధికారులు పాల్గొన్నారు.