మరణించిన ఎస్.ఐ కుటుంబానికి చెక్కును అందజేసిన సిరిసిల్ల ఎస్పీ
![మరణించిన ఎస్.ఐ కుటుంబానికి చెక్కును అందజేసిన సిరిసిల్ల ఎస్పీ](https://mudranews.in/uploads/images/2023/02/image_750x_63e0f412b8300.jpg)
ముద్ర ప్రతినిధి, రాజన్న సిరిసిల్ల: రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ టౌన్ పోలీస్ స్టేషన్లో ఎస్.ఐ గా విధులు నిర్వర్తిస్తూ గత సంవత్సరం అనారోగ్యంతో మరణించిన ఎస్.ఐ ఉపేందర్ కుటుంబానికి సోమవారం ఎస్పీ అఖిల్ మహాజన్ చెక్కును అందించారు. కార్పస్ ఫండ్ కింద రూ. 60,000 చెక్కు రూపంలో అందించారు.
ఎస్ఐ ఉపేందర్ కుటుంబానికి ప్రభుత్వం నుంచి అందవలసిన అన్ని రకాల ప్రతిఫలాలను వీలైనంత త్వరగా అందేలా తగు చర్యలు తీసుకోవాలని జిల్లా పోలీస్ కార్యాలయ అధికారులకు సూచించారు.పోలీసుల కుటుంబాలకు పోలీస్ శాఖ అన్ని రకాలుగా అండగా నిలుస్తుందని, ప్రభుత్వం ద్వారా వారికి రావాల్సిన అన్ని రకాల లబ్ది సాధ్యమైనంత త్వరగా ఇప్పించేలా కృషి చేస్తామని ఎస్పీ అఖిల్ మహాజన్ తెలిపారు.