ఆర్టీసి హైటెక్ బస్సు బోల్తా... తృటిలో తప్పిన పెను ప్రమాదం

ఆర్టీసి హైటెక్ బస్సు బోల్తా... తృటిలో తప్పిన పెను ప్రమాదం
TSRTC bus accident in asifabad telangana

ముద్ర, ప్రతినిధి, అసిఫాబాద్ ( మంచిర్యాల): కుమ్రంభీం ఆసిఫాబాద్‌ జిల్లా   కేంద్రంకు సమీపంలోని అయ్యప్ప టెంపుల్ దగ్గర సోమవారం ఉదయం ఆరు గంటలకు ఆసిఫాబాద్ నుంచి హైదరాబాద్ కు వెళ్తున్న ఆర్టీసీ సూపర్ లగ్జరీ బస్సు బోల్తా పడింది. బస్సు నడుపుతున్న డ్రైవర్ సాదేష్ కు చాతిలో నొప్పి రావడంతో బస్సు నుండి దూకేయడం తో ప్రమాదం జరిగినట్టు తెలుస్తోంది. ఘటన సమయంలో ఏడుగురు ప్రయాణికులు ఉండగా, కండక్టర్ తో పాటు మరో మహిళా ప్యాసింజర్ కి స్వల్ప గాయాలైయ్యాయి. జిల్లా కేంద్రంలోని హాస్పిటల్ కి తరలించారు. ప్రయాణికులు అంత సేఫ్. ఘటనా స్థలాన్ని పరిశీలించిన డీ ఎం శ్రీధర్.