ప్రజావాణికి వినతుల వెల్లువ – పట్టణ సమస్యలపై ‘ముద్ర’ కథనంతో సీపీఎం ఫిర్యాదు

ప్రజావాణికి వినతుల వెల్లువ – పట్టణ సమస్యలపై ‘ముద్ర’ కథనంతో సీపీఎం ఫిర్యాదు
ముద్ర కథనంతో పిర్యాదు చేస్తున్న సీపీఎం లీడర్లు

ముద్ర, జనగామ ప్రతినిధి: జనగామ కలెక్టరేట్‌ సోమవారం నిర్వహించిన ప్రజావాణికి పెద్ద సంఖ్యలో దరఖాస్తులు వచ్చాయి. మొత్తం 50 దరఖాస్తులు రాగా అందులో అధికంగా రెవెన్యూ శాఖకు 30 వినతులు వచ్చాయి. అడిషనల్‌ కలెక్టర్ ప్రపూల్ దేశాయ్ ప్రజల నుంచి అర్జీలు స్వీకరించారు. జనగామ పట్టణ అభివృద్ధి, సమస్యలపై ‘ముద్ర’ ప్రచురితమైన కథనంతో సీపీఎం లీడర్ బూడిద గోపి ఫిర్యాదు చేశారు.

అనంతరం జరిగిన మీటింగ్‌లో అడిషనల్‌ కలెక్టర్‌‌ మాట్లాడుతూ మాట్లాడుతూ ప్రజావాణి దరఖాస్తులను వెంటనే పరిష్కరించాలని ఆఫీసర్లను ఆదేశించారు. కార్యక్రమంలో ఆర్డీవో కృష్ణవేణి, కలెక్టరేట్ పరిపాలన అధికారి మన్సురి, జిల్లా అధికారులు పాల్గొన్నారు.